Saturday, June 1, 2024

TGSRTC నకిలీ లోగో.. ఇద్దరిపై కేసు నమోదు

టీజీఎస్‌ఆర్టీసీ నకిలీ లోగోను సృష్టించి సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని ఆర్టీసీ అధికారులు హైదరాబాద్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కొంతం దిలీప్, హరీష్ రెడ్డిలపై ఐపీసీ, ఐటీ చట్టం కింద కేసులు నమోదు చేశారు. టీజీఎస్‌ఆర్‌టీసీ, రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ఠను దెబ్బతీసేలా నిందితులు పోస్టులు పెడుతున్నారని ఆర్టీసీ అధికారులు తెలిపారు.

ఈ ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. టీజీఎస్ ఆర్టీసీ కొత్త లోగో అంటూ సాగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఎక్స్(ట్విట్టర్)లో పోస్ట్ చేశారు. ఆ లోగోతో కంపెనీకి ఎలాంటి సంబంధం లేదని సజ్జనర్ తెలిపారు. ఇప్పటివరకు కొత్త లోగోను అధికారికంగా విడుదల చేయలేదని టీజీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement