Sunday, May 5, 2024

Breaking : ఫ్యాక్ట‌రీలో మంట‌లు.. త‌ప్పిన ప్రాణ న‌ష్టం

ఓ ఫ్యాక్ట‌రీలో మంట‌లు చెల‌రేగాయి. దాంతో ఘ‌ట‌నాస్థ‌లికి 16అగ్నిమాప‌క యంత్రాలు చేరుకుని మంట‌ల‌ను అదుపులోకి తెచ్చేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. ఈ సంఘ‌ట‌న ఢిల్లీలోని ఓఖ్లా ఫేజ్1లో చోటు చేసుకుంది. ఫ్యాక్ట‌రీలో మంట‌లు ఎగిసిప‌డుతుండ‌గా, భ‌వ‌నంలోప‌ల ఎవ‌రూ చిక్కుకోలేద‌ని తెలియ‌డంతో అంద‌రూ ఊపిరిపీల్చుకున్నారు. అగ్నిప్ర‌మాదానికి కార‌ణం ఏంట‌నే వివ‌రాలు ఇంకా వెలుగుచూడ‌లేద‌ని అధికారులు తెలిపారు. ప్రాధ‌మిక ద‌ర్యాప్తు అనంత‌రం మ‌రిన్ని వివ‌రాలు వెల్ల‌డిస్తామ‌ని చెప్పారు.ఈ ప్ర‌మాదంలో ఎలాంటి ప్రాణ న‌ష్టం వాటిల్లిన స‌మాచారం లేద‌ని వెల్ల‌డించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement