Thursday, May 9, 2024

Breaking : పోల‌వ‌రానికి చంద్ర‌బాబు ప‌నులే శాపం – సీఎం జ‌గ‌న్

పోల‌వ‌రంపై అసెంబ్లీలో చ‌ర్చ జ‌రుగుతోంది. టిడిపి అధినేత చంద్ర‌బాబు చేసిన ప‌నులు పోల‌వ‌రానికి శాపంగా మారాయ‌న్నారు సీఎం జ‌గ‌న్. అసంపూర్తిగా కాఫ‌ర్ డ్యామ్ లు ఉన్నాయ‌ని చెప్పారు. వ‌ర్షాలు, వ‌ర‌ద‌లు వ‌చ్చిన‌ప్పుడు ప‌నుల‌కు క‌ష్టాలు త‌ప్ప‌డం లేద‌న్నారు. ఓ ప్లానింగ్, ప‌ద్ద‌తి లేనే లేద‌న్నారు. స్పిల్ వే క‌ట్ట‌డంలో బాబు త‌ప్పులు చేశార‌న్నారు. పోల‌వ‌రం పూర్త‌వుతోందంటే చంద్ర‌బాబుకి క‌డుపుమంట అని జ‌గ‌న్ విమ‌ర్శించారు. చంద్ర‌బాబు చేసిన ప‌నులు పోల‌వ‌రానికి శాపంగా మారాయ‌న్నారు..ప్రాజెక్టు డిజైన్ ప్ర‌కారం న‌దిని కుడివైపు మ‌ళ్లించాల‌న్నారు.మ‌ళ్లించ‌డానికి ముందే స్పిల్ వే పెట్టాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. 14ఏళ్లు సీఎంగా ఉన్న వ్య‌క్తి చంద్ర‌బాబు..మంచి చేశాన‌ని చెప్పుకోవ‌డానికి ఆయ‌న‌కి ఒక్క‌టీ లేద‌న్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement