Friday, May 3, 2024

స‌ల్మాన్ ఖాన్ చిత్రంలో – వెంక‌టేష్,జ‌గ‌ప‌తిబాబు !

బాలీవుడ్ స్టార్ హీరో స‌ల్మాన్ ఖాన్ ప్ర‌ధాన పాత్ర‌లో ఓ చిత్రం తెర‌కెక్క‌నుంది. ప‌ర్హాద్ సామ్జీ ద‌ర్శ‌క‌త్వంలో ఓ హిందీ సినిమా రాబోతోంది. క‌బీ ఈద్ క‌బీ దీవాళి,భాయ్ జాన్ వంటి టైటిల్స్ ప‌రిశీల‌న‌లో ఉన్న ఈ ఫ్యామిలీ డ్రామాలో స‌ల్మాన్ కి జోడీగా పూజా హెగ్డే న‌టించ‌నుంది. మే 11 నుంచి సెట్స్ పైకి వెళ్ళ‌నున్న ఈ భారీ బ‌డ్జెట్ మూవీలో వెంక‌టేశ్ ఓ స్పెష‌ల్ రోల్ లో న‌టించ‌బోతున్న‌ట్లు కొన్నాళ్ళుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. అంతేకాదు.. ఇందులో ప్ర‌తినాయ‌కుడిగా జ‌గ‌ప‌తి బాబు క‌నిపించ‌బోతున్న‌ట్లు స‌మాచారం. అలాగే, వెంకీ – జ‌గ్గూ భాయ్ మ‌ధ్య కూడా కొన్ని స‌న్నివేశాలు ఉంటాయ‌ని వినిపిస్తోంది. మ‌రి.. ఈ క‌థ‌నాల్లో వాస్త‌వ‌మెంతో తెలియాలంటే కొన్నాళ్ళు వేచి చూడాల్సిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement