Thursday, May 2, 2024

హుజురాబాద్ ఫలితాలు: మూడో రౌండ్ లో TRSకు షాక్.. ఆధిక్యంలో ఈటల

హుజురాబాద్‌ ఉప ఎన్నిక ఫలితాల్లో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ దూసుకుపోతున్నారు. తొలి మూడు రౌండ్లలో ఆయన స్పష్టమైన ఆధిక్యంతో కొనసాగుతున్నారు. మొత్తం 22 రౌండ్‌లు నిర్వహించనుండగా..  ఇప్పటి వరకు మూడు రౌండ్లు పూర్తి అయ్యాయి. తొలి రెండు రౌండ్‌లో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ 359 ఓట్ల ఆధిక్యంలో ఉండగా.. మూడవ రౌండ్‌లో కూడా ఆయనే ఆధిక్యంలో కొనసాగుతున్నారు. మూడో రౌండ్లో 911 ఓట్ల ఆధిక్యత సాధించారు. మూడవ రౌండ్ ముగిసే సమయానికి టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ పై ఈటల 1,269 ఓట్ల ఆధికత్యతో ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement