Sunday, April 28, 2024

India Corona: దేశంలో తగ్గిన కరోనా కేసులు.. మరణాలు

దేశంలో క‌రోనా వైర‌స్ ఉధృతి తగ్గుతోంది. గ‌డిచిన 24 గంట‌ల్లో కొత్త‌గా 10,423 పాజిటివ్ కేసులు న‌మోదు  అయ్యాయి. కరోనాతో 443 మంది మ‌ర‌ణించారు. అదే సమయంలో మ‌రో 15,021 మంది క‌రోనా నుంచి కోలుకున్నారు. ప్ర‌స్తుతం దేశంలో 1,53,776 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇప్పటి వరకు మొత్తం కేసుల సంఖ్య 3,42,96,237ల‌కు చేరింది. ఇందులో  3,36,83,581 మంది కోలుకున్నారు. మొత్తం 4,58,880 మంది మ‌ర‌ణించారు. ఇప్ప‌టి వ‌ర‌కు 1,06,85,71,879 మంది కొవిడ్ టీకా తీసుకున్నట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ వెల్ల‌డించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement