Sunday, April 28, 2024

Big Breaking: ములుగు జిల్లాలో దారుణం.. అడ్వొకేట్‌ని క‌త్తుల‌తో న‌రికి చంపిన దుండ‌గులు

తెలంగాణ రాష్ట్రంలోని ములుగు జిల్లాలో దారుణం జ‌రిగింది. ములుగు జిల్లా కేంద్రానికి దాదాపు 11 కిలోమీట‌ర్ల దూరంలోని పందికుంట బస్టాఫ్ వద్ద ఈ ఘ‌ట‌న జ‌రిగిన‌ట్టు స‌మాచారం. మల్లారెడ్డి అనే న్యాయ‌వాదిని ఇవ్వాల (సోమ‌వారం) సాయంత్రం దాదాపు 7 గంట‌ల ప్రాంతంలో దారుణంగా నరికి చంపేశారు దుండగులు. ఎర్ర మట్టి క్వారీ… పాత కక్షలే కారణంగా తెలుస్తోంది. పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్తున్నారు. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన మ‌రిన్ని వివరాలు తెలియలిసి ఉంది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement