Saturday, May 4, 2024

మోడ‌ల్ స్కూల్‌లో ఫుడ్ పాయిజ‌న్‌.. 20 మంది స్టూడెంట్స్‌కి సీరియ‌స్‌

కరీంనగర్ జిల్లాలోని ఓ మోడ‌ల్‌స్కూల్‌లో ఫుడ్ పాయిజ‌న్ అయ్యింది. ఇవ్వాల (సోమ‌వారం) సాయంత్రం భోజ‌నం చేసిన కొంత‌మంది స్టూడెంట్స్ అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యారు. జిల్లాలోని మానకొండూరు మండలం పోచంపల్లి మోడల్ స్కూల్లో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. దీంతో 20 మంది విద్యార్థులు అస్వస్థత గురయ్యారు.

అస్వస్థతకు గురైన విద్యార్థులకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స నిర్వహించారు. ఫుడ్ పాయిజన్ కు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. ప్ర‌స్తుతం అయితే విద్యార్థినుల ఆరోగ్యం బాగానే ఉంద‌ని, ట్రీట్‌మెంట్ కొన‌సాగుతున్న‌ట్టు డాక్ట‌ర్లు చెప్పారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement