Saturday, May 4, 2024

Mumbai Indians : ఇషాన్​ కిష‌న్ కు మ్యాచ్ ఫీజు కోత

ముంబై ఇండియన్స్ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్‌ మ్యాచ్‌ ఫీజులో 10 శాతం కోత పడింది. ఢిల్లీలోని అరుణ్‌జైట్లీ స్టేడియంలో నిన్న మధ్యాహ్నం ఢిల్లీ కేపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఓటమి పాలైంది. ఈ మ్యాచ్‌లో ఇషాన్ ఐపీఎల్ నియమావళిలోని ఆర్టికల్ 2.2ని ఉల్లంఘించి లెవల్ 1 నేరానికి ఉల్లంఘించాడు.

- Advertisement -

తన తప్పును ఇషాన్ అంగీకరించాడని, మ్యాచ్ రిఫరీ విధించిన జరిమానాను అంగీకరించినట్టు ఐపీఎల్ పేర్కొంది. లెవల్ 1 స్థాయి ఉల్లంఘనకు మ్యాచ్ రిఫరీ నిర్ణయమే ఫైనల్. దీనికి ఆటగాడు కట్టుబడి ఉండాల్సిందే. తనపై మోపిన అభియోగాలను ఇషాన్ అంగీకరించడంతో నిర్వాహకులు ఆ నేరం ఏంటన్న దానిని బయటపెట్టలేదు. నిన్నటి మ్యాచ్‌లో ఢిల్లీ నిర్దేశించిన 258 పరుగుల విజయ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ముంబై 247 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement