Monday, May 6, 2024

Exclusive | ఏలూరు జిల్లాలో దారుణం.. నాలుగు నెల‌లుగా బాలికపై గ్యాంగ్ రేప్‌!

ఏలూరు జిల్లాలో దారుణం జ‌రిగింది. మండవల్లి బీసీ వసతి గృహంలో ఉంటూ ప్రభుత్వ స్కూళ్లో చదువుతున్న ఐదో తరగతి విద్యార్థినిపై ముగ్గురు వ్య‌క్తులు సామూహికంగా లైంగిక దాడికి పాల్ప‌డ్డారు. నాలుగు నెలలుగా ఆ బాలికపై వీరు అత్యాచారం చేస్తున్నట్టు స‌మాచారం. కాగా వారిలో ఒకరు మైనర్ బాలుడు ఉండ‌గా, మ‌రో వ్య‌క్తి స్వ‌యంగా ఆ బాలిక అన్న‌య్య‌గా స‌మాచారం అందుతోంది.

ఇక‌.. ఆ బాలుడు కూడా బాలిక చ‌దువుకునే స్కూళ్లోనే 7వ తరగతి చదువుతున్న‌ట్టు స‌మాచారం. ఇందులో ఒకరు బాలిక సొంత అన్నయ్య (పెద్దమ్మ కొడుకు), కాగా, మరో వ్యక్తి మండవల్లి మండలం భైరవపట్నం చెందిన లారీ డ్రైవర్ ఉన్న‌ట్టు స‌మాచారం. కాగా, ఈ ఘ‌ట‌న‌కు సంబంధించి పోలీసులు ఇప్ప‌టికే ఇద్ద‌రు నిందితుల‌ను అదుపులోకి తీసుకున్నారు. ప్రధాన నిందితుడైన బాలిక అన్నయ్య కోసం గాలింపు చేప‌ట్టారు. దీనికి సంబంధించి మరో కొద్దిసేపట్లో ఏలూరు డీఎస్పీ మీడియాకు పూర్తి వివ‌రాలు వెల్ల‌డించ‌నున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement