Friday, April 26, 2024

ఆర్మీ హెలికాప్ట‌ర్ కూలిన ప్ర‌దేశాన్ని సంద‌ర్శించ‌నున్న సీఎం స్టాలిన్ ..

ఆర్మీ హెలికాఫ్ట‌ర్ త‌మిళ‌నాడు నీల‌గిరి వ‌ద్ద కుప్ప కూలింది. కాగా ఈ హెలికాఫ్ట‌ర్ లో సీడీఎస్ బిపిన్ రావ‌త్, ఆయ‌న భార్యతో పాటు ప‌లువురు ముఖ్య అధికారులు ఉన్నారు. ఈ ప్ర‌మాదంలో 11మంది మ‌ర‌ణించారు. ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. కాగా బిపిన్ రావ‌త్ కి తీవ్ర గాయాలు అయ్యాయి. ఆయ‌న ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై తమిళనాడు సీఎం స్టాలిన్ స్పందించారు. ఘటన స్థలికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఈ మేర‌కు చెన్నై నుంచి కోయంబత్తూరు చేరుకోనున్నారు. అక్కడి నుంచి నీలగిరి వెళతారు.ఈ ఘటనను ప్రత్యక్షంగా చూసిన ఓ సాక్షి కథనం ప్రకారం…. మంటల్లో చిక్కుకున్న హెలికాప్టర్ ను చూశామన్నారు. హెలికాప్టర్ కూలిపోతున్న సమయంలో చెట్ల మీదుగా ముగ్గురు వ్యక్తులు కిందికి పడిపోవడం గమనించామని, అయితే మంటలు వ్యాపించడంతో తాము వెళ్లలేకపోయామని ఓ వ్య‌క్తి చెప్పాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement