Tuesday, April 23, 2024

సంక్షేమ సంఘాల ఐక్యతతో కాలనీల అభివృద్ధి సాధ్యం : ఎమ్మెల్యే కేపీ

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, సుభాష్ నగర్ 130వ‌ డివిజన్ పరిధిలోని భాగ్యలక్ష్మి కాలనీ రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతనంగా ఎన్నికైన సందర్భంగా ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ను సభ్యులు పేట్ బషీరాబాద్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద మాజీ కార్పొరేటర్ సురేష్ రెడ్డితో పాటు మర్యాద పూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. కాలనీల సంక్షేమ సంఘాల ఐక్యతతో అభివృద్ధి మరింత సాధ్యమ‌ని అన్నారు. ఎటువంటి సమస్యలున్నా… తన దృష్టికి తీసుకురావాలని, వాటి పరిష్కారానికి ఎప్పుడూ ముందుంటానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకుడు కుంటి మల్లేష్, కాలనీ ప్రెసిడెంట్ సాగర్ రెడ్డి, జనరల్ సెక్రెటరీ యాదగిరి యాదవ్, రామ్మోహన్ రావు, సత్యనారాయణ, శ్రీహరి, రామ్ రెడ్డి, శంకర్ చారి, పద్మజ, ప్రసాద్, శ్రీధర్, నర్సింగ్ రావు, ఆంజనేయులు, ప్రభు, నరేందర్, తదితరులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement