Friday, May 3, 2024

ఏపీని వదిలేసి తెలంగాణకు వస్తా: ఏపీ టీడీపీ నేత జేసీ

తెలంగాణ అసెంబ్లీకి ఏపీకి చెందిన టీడీపీ నేత, మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి వచ్చారు. శాసన సభా సమావేశాల సందర్భంగా ఆయన అసెంబ్లీకి వచ్చారు. సీఎల్పీలో పాత మిత్రులను కలిశారు. అసెంబ్లీ ప్రాంగణంలో సీఎం కేసీఆర్‌ను దివాకర్‌ రెడ్డి కలిశారు. ఈ సందర్భంగా జేసీ దివాకర్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం రాజకీయాలు బాగాలేవు, సమాజం కూడా బాగోలేదని చెప్పారు. ఏపీ కన్నా తెలంగాణలో రాజకీయాలు బాగున్నాయని తెలిపారు. తాను ఆంధ్రప్రదేశ్‌ని వదిలేసి తెలంగాణకు వస్తానని వెల్లడించారు. తెలంగాణను వదిలిపెట్టడంతో చాలా నష్టపోయానని చెప్పారు. జానారెడ్డి తనకు మంచి మిత్రుడని.. నాగార్జునసాగర్‌ ఉప ఎన్నికలో జానా గెలవడని తాను ముందే చెప్పానని అన్నారు. జానారెడ్డి ఎందుకు ఓడిపోయారో అందరికీ తెలుసునని పేర్కొన్నారు. ఇక, హుజూరాబాద్‌ ఉపఎన్నిక గురించి తనకు తెలియదని జేసీ చెప్పారు.  

ఇది కూడా చదవండి: ఏపీలోని స్కూళ్లపై కరోనా పంజా.. 19 మంది విద్యార్థులకు వైరస్

Advertisement

తాజా వార్తలు

Advertisement