Sunday, April 28, 2024

ఏపీలోని స్కూళ్లపై కరోనా పంజా.. 19 మంది విద్యార్థులకు వైరస్

ఆంధ్రప్రదేశ్ లోని పాఠశాలల్లో కరోనా కలకలం సృష్టిస్తోంది. ఆగస్టు 16న ప్రభుత్వం పాఠశాలలను పునః ప్రారంభించినప్పటి నుంచి పదుల సంఖ్యలో విద్యార్థులు, టీచర్లు కరోనా మహమ్మారి బారిన పడుతున్నారు. తాజాగా విశాఖ జిల్లా జి.మాడుగుల బాలుర ఆశ్రమ పాఠశాలలో కరోనా కలకలం రేపింది. మొత్తం 19 మంది విద్యార్థులకు వైరస్‌ సోకినట్లు నిర్ధారణ అయింది. దీంతో ఆశ్రమ పాఠశాలకు అధికారులు వారం రోజుల పాటు సెలవు ప్రకటించారు. కరోనా సోకిన విద్యార్థులకు చికిత్స అందిస్తున్నారు. స్కూలు పరిశారాలను శానిటైజ్ చేసి.. ఇతరులకు సోకకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా స్కూల్స్ లో కరోనా కేసులు బయటపడడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.

ఇది కూడా చదవండి: సీఎం కేసీఆర్ కు బండి సంజయ్ లేఖ

Advertisement

తాజా వార్తలు

Advertisement