Tuesday, May 14, 2024

అప్పులు చేయ‌డంలో అగ్ర‌గామిగా ఏపీ స‌ర్కార్ – బిజెపి నేత పురంధ్రీశ్వ‌రి ఫైర్

మూడేళ్ల‌లో వైసీపీ ప్ర‌భుత్వం మూడు లోల కోట్లు అప్పు చేసి ..ప్ర‌జ‌ల‌పై భారం మోపింద‌ని బిజెపి నాయ‌కురాలు పురంధ్రీశ్వ‌రి మండిప‌డ్డారు. బీజేపీ నేత‌ల‌తో క‌లిసి ఆమె విశాఖ‌లో ప‌ర్య‌టించారు. అభివృద్ధిలో అగ్ర‌గామిగా నిల‌వాల్సింది పోయి, అప్పులు చేయ‌డంలో అగ్ర‌గామిగా ఏపీ ప్ర‌భుత్వం నిలిచింద‌ని ఆమె ఎద్దేవా చేశారు. రాబోయే ఆదాయాన్ని చూపెడుతూ అప్పులు తీసుకునే ప్ర‌భుత్వం.. దేశంలో ఏపీలోనే ఉంద‌ని చుర‌క‌లు అంటించారు. జీవీఎంసీలోని ఆస్తుల‌ను కుద‌వ‌పెట్టి ఏపీ ప్ర‌భుత్వం అప్పులు చేస్తోంద‌ని పురందేశ్వ‌రి మండిప‌డ్డారు. ఏపీలో రోడ్ల ప‌రిస్థితి దారుణంగా మారింద‌ని.. కేంద్ర ప్ర‌భుత్వం నిధులు ఇస్తున్న‌ప్ప‌టికీ రాష్ట్ర ప్ర‌భుత్వం రోడ్లు నిర్మించ‌డం లేద‌ని ఆమె ఆరోపించారు. ఏపీ స‌ర్కారుని ప్ర‌శ్నించిన వారిపై కేసులు పెడుతూ వారిని భ‌య‌పెడుతున్నార‌ని దుయ్య‌బ‌ట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement