Monday, May 13, 2024

ఏపీలో భారీగా క‌రోనా కేసులు – అత్య‌ధికంగా చిత్తూరులో 254కేసులు

ఏపీలో క‌రోనా కేసులు భారీగా న‌మోద‌వుతున్నాయి. గ‌డ‌చిన 24గంట‌ల్లో 38,479 క‌రోనా శాంపిల్స్ ని ప‌రీక్షించ‌గా 1,257పాజిటీవ్ కేసులు నిర్థార‌ణ అయ్యాయి. కాగా అత్య‌థికంగా చిత్తూరు జిల్లాలో 254కేసులు న‌మోదయ్యాయి. ఇక విశాఖ జిల్లాలో 196, అనంతపురం జిల్లాలో 138, కృష్ణా జిల్లాలో 117, గుంటూరు జిల్లాలో 104, నెల్లూరు జిల్లాలో 103 కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 140 మంది కరోనా నుంచి కోలుకోగా, ఇద్దరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 20,81,859 పాజిటివ్ కేసులు నమోదవగా… 20,62,580 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 4,774 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 14,505కి పెరిగింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement