Monday, April 29, 2024

విశాఖలో ప్రభుత్వ భూముల అమ్మకానికి హైకోర్టు బ్రేక్

ఏపీ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ విశాఖ‌లోని భూముల అమ్మ‌కానికి హైకోర్టు బ్రేక్ వేసింది. గ‌తంలో బిల్డ్ ఏపీ పేరుతో విశాఖలోని ఖరీదైన భూములను అమ్మేందుకు జగన్ సర్కారు ప్రయత్నించగా.. కోర్టు స్టే ఇచ్చింద‌ని, ఇప్పుడు మ‌రో పేరుతో ప్ర‌భుత్వం కుట్ర‌పూరితంగా వ్య‌వ‌హ‌రిస్తుంద‌ని పిటిష‌నర్ కోర్టు దృష్టికి తెచ్చాడు. విశాఖ‌ప‌ట్నంలో మొత్తం ఐదు చోట్ల భూములు అమ్మ‌టానికి ప్ర‌భుత్వం నోటిఫికేష‌న్ ఇచ్చింద‌ని, దీనిపై స్టే ఇవ్వాల‌ని కోరాడు. పిటిష‌న‌ర్ వాద‌న‌తో ఏకీభ‌వించిన హైకోర్టు ధ‌ర్మాస‌నం… బిల్డ్ ఏపీపై ఇచ్చిన స్టే ఆదేశాలే విశాఖ భూముల అమ్మ‌కానికి వ‌ర్తిస్తాయ‌ని స్ప‌ష్టం చేసింది. టెండ‌ర్లు ఫైన‌లైజ్ చేయ‌కుండా మ‌ధ్యంత‌ర ఉత్త‌ర్వులు జారీ చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement