Saturday, April 27, 2024

అమిత్ షా ప‌ర్య‌ట‌న – హైద‌రాబాద్ లోని ప‌లు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్ష‌లు

హైద‌రాబాద్ లోని రామంతాపూర్ తో పాటు మ‌హేశ్వ‌రం నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలోని తుక్కుగూడ‌లో ప‌ర్య‌టించ‌నున్నారు కేంద్ర‌హోంమంత్రి అమిత్ షా. ఈ నేప‌థ్యంలో హైద‌రాబాద్‌లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్ష‌లు విధించారు. ఈ నేప‌థ్యంలో ఈ రూట్ల‌లో వెళ్లే వాహ‌న‌దారులు ప్ర‌త్యామ్నాయ మార్గాలు ఎంచుకోవాల‌ని పోలీసులు సూచించారు. రామంతాపూర్‌లో సెంట్ర‌ల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబోరేట‌రీని అమిత్ షా ప్రారంభించ‌నున్నారు. అనంత‌రం సెమినార్ హాల్‌లో నిర్వ‌హించే కార్య‌క్ర‌మంలో హోంమంత్రి పాల్గొంటారు. ఆ స‌మావేశం ముగిసిన అనంత‌రం తుక్కుగూడ‌కు బ‌య‌ల్దేరుతారు. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు తుక్కుగూడ వైపు వ‌చ్చే మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్ష‌లు విధించారు. దీంతో ఎల్‌బీనగర్‌, హయత్‌నగర్‌, దిల్‌సుఖ్‌నగర్‌, మలక్‌పేట, చాంద్రాయ‌ణ‌గుట్ట నుంచి ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లే వారు ప్రత్యమ్నాయ మార్గలు ఎంచుకోవాల‌ని సూచించారు. అంతేకాకుండా ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెం.14 నుంచి మధ్యాహ్నం 12 నుంచి రాత్రి 11 గంటల వరకు భారీ వాహనాలు అనుతించ‌బోమ‌ని స్ప‌ష్టం చేశారు పోలీసులు.

Advertisement

తాజా వార్తలు

Advertisement