Wednesday, May 1, 2024

Amit Shah: నాగాలాండ్ ఘటనపై సిట్ ఏర్పాటు

నాగాలాండ్ లో భద్రతాబలగాలు పొరబాటున జరిపిన కాల్పుల్లో పలువురు పౌరులు మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ
ఈ ఘటనపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సోమవారం లోక్ సభలో కీలక ప్రకటన చేశారు. ఆత్మరక్షణ కోసమే సైనిక బలగాలు కాల్పులు జరిపాయని ఆయన తెలిపారు. నాగాలాండ్ లో ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని వెల్లడించారు. నాగాలాండ్ ఘటనపై సిట్ ఏర్పాటు చేశామని, 30 రోజుల్లో నివేదిక సమర్పిస్తుందని  చెప్పారు. ఘటనపై నాగాలాండ్ ఉన్నతాధికారులతోనూ చర్చించామని వివరించారు. ఈ ఘటనపై సైన్యం కూడా ఓ ప్రకటన విడుదల చేసిందని, సామాన్య పౌరులు ప్రాణాలు కోల్పోవడంపై తీవ్ర విచారం వ్యక్తం చేసిందని అమిత్ షా తెలిపారు. ఈ దురదృష్టకర ఘటనపై సైన్యం కూడా ఉన్నతస్థాయి విచారణ జరుపుతుందని తెలిపారు.

కాగా, నాగాలాండ్ లో భద్రతాబలగాలు పొరబాటున సామాన్య పౌరులపై కాల్పులు జరపడం సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. పౌరులను తీవ్రవాదులుగా భావించిన భద్రతా బలగాలు కాల్పులు జరపడంతో 13 మంది మృతి చెందారు. ఈ ఘటన అనంతరం నాగాలాండ్ లో ఉద్రిక్త పరిస్థులు నెలకొన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement