Saturday, April 20, 2024

అంబేద్కర్ ఆలోచన విధానంతో ముందుకు నడవాలన్న‌ కూన శ్రీశైలం గౌడ్

అంబేద్క‌ర్ ఆలోచ‌న విధానంతో మ‌న‌మంద‌రం ముందుకు న‌డ‌వాల‌ని కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ అన్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, గాజులరామారం డివిజన్ లో కూన సౌజన్య గార్డెన్ లో భారతరత్న డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ వర్ధంతిని పురస్కరించుకుని ఈరోజు ఆయ‌న చిత్రప‌టానికి పూల‌మాల‌లు వేసి నివాళుల‌ర్పించారు.

అనంతరం కూన శ్రీశైలం గౌడ్ మాట్లాడుతూ… ఒక ప్రముఖ భారతీయ న్యాయవాది, ఆర్థిక శాస్త్రవేత్త, రాజకీయ నేత, సంఘ సంస్కర్త, అంటరానితనం, కుల నిర్మూలన కోసం ఎంతో కృషి చేశాడన్నారు. స్వాతంత్ర్య భారతదేశపు మొట్టమొదటి కేంద్ర న్యాయశాఖ మంత్రి, రాజ్యాంగ శిల్పి, భారత రత్న బి.ఆర్‌.అంబేడ్కర్‌ దేశానికి ఉపయుక్తమైన రాజ్యాంగాన్ని అందించార‌ని, ఆయ‌న‌ ఆలోచన విధానంలోనే అందరూ నడవాలన్నారు.ఈ కార్యక్రమంలో ch బుచ్చిరెడ్డి, మొటే శ్రీనివాస్ యాదవ్, గరిగే శేఖర్ ముదిరాజ్, సాయి సత్యమ్, బలరాం, విజయ్, యామ్, లింగం యాదవ్, అరుణ్, రాజిరెడ్డి, సంతోష్, బాలకృష్ణ, బిల్లా, చిలకా, నరేందర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

- Advertisement -

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement