Friday, April 26, 2024

భూగర్భడ్రైనేజీ ఔట్ లెట్ సమస్య పరిష్కారానికి కృషి చేస్తాన‌న్న ఎమ్మెల్యే కేపీ

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలోని 2వ డివిజన్ సాయికృష్ణ కాలనీలో భూగర్భ డ్రైనేజీ ఔట్ లెట్ సమస్యపై ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ విచ్చేసి స్థానిక కార్పొరేటర్ చిట్ల దివాకర్ తో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా డ్రైనేజీ ఔట్ లెట్ సమస్యను స్థానిక ప్రజలతో కలిసి పరిశీలించారు. అనంతరం సమస్య శాశ్వత పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక డిప్యూటీ మేయర్ దన్ రాజ్ యాదవ్, కార్పొరేటర్లు కాసాని సుధాకర్, సురేష్ రెడ్డి, నిజాంపేట్ అధ్యక్షుడు రంగరాయ ప్రసాద్, సీనియర్ నాయకులు కొలన్ గోపాల్ రెడ్డి, నిజాంపేట్ ప్రధాన కార్యదర్శి నాగరాజ్ యాదవ్, డివిజన్ అధ్యక్షుడు చందు, ఉపాధ్యక్షులు రాములు నాయక్, ఆర్గనైజంగ్ సెక్రటరీ సాంబశివ రెడ్డి, కాలనీ అధ్యక్షులు సురేష్, ఉపాధ్యక్షులు తిరుపతి రెడ్డి, సెక్రటరీ ఉపేంద్ర తదితరులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement