Friday, April 26, 2024

నిజామాబాద్ ప్రభుత్వాస్పత్రిలో ఘోరం.. గిరాకీ లేదని అంబులెన్స్ డ్రైవర్ల కిరాతకం..

కరోనా మహమ్మారితో ప్రజలు అల్లాడుతుంటే శవాల మీద చిల్లర ఏరుకునే దుర్మార్గులు బయల్దేరారు. తమకు గిరాకీ లేదని ఏకంగా ఐసీయూలోని కరోనా రోగులను చంపేందుకు కూడా వెనకాడలేదు కిరాతకులు. కరోనా రోగులకు సీరియస్‌ అయినా.. చనిపోయినా తమకు కిరాయి వస్తుందని అంబులెన్స్ డ్రైవర్లు అత్యంత కిరాతక చర్యకు పూనుకున్నారు. ఆక్సిజన్ సప్లై ఆపేసి రోగుల ప్రాణాలతో చెలగాటమాడారు. ఆస్పత్రి వార్డుబాయ్ ఆ దారుణాన్ని చూడడంతో రోగుల ప్రాణాలు నిలిచాయి. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో ఈ ఘోరం జరిగింది.

తమకు కొద్దిరోజులుగా పేషంట్లు దొరకడం లేదని.. గిరాకీ పెంచుకునేందుకు ముగ్గురు అంబులెన్స్ డ్రైవర్లు దారుణానికి ఒడిగట్టారు. ఐసీయూలో చికిత్స పొందుతున్న కరోనా రోగులకు ఆక్సిజన్‌ సరఫరాని ఆపేశారు. ఆక్సిజన్ సప్లై ఆగిపోవడాన్ని గమనించిన వార్డు బాయ్ వెంటనే అప్రమత్తం కావడంతో పెనుప్రమాదం తప్పింది. ఆక్సిజన్ సప్లై ఆపేసిన ఓ ప్రైవేట్ అంబులెన్స్ డ్రైవర్‌ను గుర్తించి ఆస్పత్రి సిబ్బంది పట్టుకుని పోలీసులకు సమాచారం అందించారు. కొద్దిరోజులుగా అంబులెన్సులకు గిరాకీ లేదని.. ఎవరికైనా సీరియస్ అయినా, లేకుంటే చనిపోతే తమకు గిరాకీ వస్తుందని భావించి ఈ పని చేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటనను ఆస్పత్రి అధికారులు సీరియస్‌గా తీసుకున్నారు. ఆక్సిజన్ సప్లై ఆపేసిన ఓ ప్రైవేట్ అంబులెన్స్ డ్రైవర్‌ను గుర్తించి ఆస్పత్రి సిబ్బంది పట్టుకుని పోలీసులకు సమాచారం అందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement