Friday, April 26, 2024

పెద్దపల్లి జిల్లాలో ఆక్సిజన్ రైలులో మంటలు

హైదరాబాద్‌ నుంచి రాయ్‌చూర్‌ వెళ్తున్న ఆక్సిజన్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలులో మంటలు చెలరేగాయి. పెద్దపల్లి మండలం చీకురాయి వద్ద శనివారం ఈ ఘటన చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపశాఖ సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలు అంటుకున్న ట్యాంకర్‌ నుంచి మిగతా వాటిని విడదీసి, దూరంగా తరలించారు. అనంతరం మంటలను ఆర్పివేశారు. మంటలు చెలరేగిన ట్యాంకర్‌పై విద్యుత్‌ లైన్‌ ఉండగా.. ఆందోళనకు గురయ్యారు. వెంటనే అప్రమత్తమై మంటలను అదుపులోకి తీసుకురావడంతో పెను ప్రమాదం తప్పినట్లయింది. అయితే ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. బ్రేక్‌ వేసిన సమయంలో మంటలు చెలరేగి ఉంటాయని అధికారులు భావిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement