Friday, May 3, 2024

HYD: అదనపు కట్నం వేధింపులు… ఇద్దరు పిల్లలతో సహా తల్లి ఆత్మహత్య

అదనపు కట్నం వేధింపుల కారణంగా తన ఇద్దరు పిల్లలను బిల్డింగ్ తోసేసి చంపి.. ఆతర్వాత తల్లి కూడా ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన హైదరాబాద్‌లోని బన్సీలాల్‌పేటలో చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.. ఓ మహిళ డబుల్ బెడ్‌రూమ్ బిల్డింగ్ 8వ అంతస్తు నుంచి తన కూతురు, కొడుకును కిందకు తోసేసింది. ఆ తర్వాత ఆమె కూడా బిల్డింగ్ పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది.

ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. మృతులను సౌందర్య, ఆమె పిల్లలు నిత్య, నిదరీష్‌గా గుర్తించారు. అయితే కుటుంబ కలహాలే ఇందుకు కారణంగా తెలుస్తోంది. అదనపు కట్నం కోసం భర్త నుంచి వేధింపులు ఎదుర్కొంటున్నట్టుగా చెబుతున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టమ్ నిమిత్తం తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా, మృతులకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement