Friday, May 17, 2024

రోడ్డు ప్రమాదంలో బ్లడ్ బ్యాంక్ ఉద్యోగి దుర్మరణం

చీరాల, జూన్ 19(ప్రభ న్యూస్ ): ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తూ ఎద్దుల బండిని ఢీకొన్న సంఘటనలో ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన చీరాల- కారంచేడు రోడ్డులో మంచినీటి చెరువు సమీపంలో సోమవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. తెలిసిన వివరాలు మేరకు చీరాల వుడ్ నగర్ కు చెందిన రాజేష్ (40) ఒంగోలులోని ఓ ప్రైవేట్ బ్లడ్ బ్యాంకులో పని చేస్తుంటాడు.సదరు వ్యక్తి తెల్లవారుజామున ద్విచక్ర ప్రవాహనంపై చిలకలూరిపేట వెళుతుండగా మార్గమధ్యంలో మంచినీడి చెరువు వద్ద ఆగి ఉన్న ఎద్దుల బండిని వెనకనుంచి ఢీకొట్టాడు.

ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలైన ఇతన్ని స్థానికుల సమాచారం మేరకు 108 సిబ్బంది చీరాల ఏరియా ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతుడికి భార్య రాధా గ్రేస్ ఇద్దరు కుమారులు ఉన్నారు.ఈ ఘటనపై ఒకటో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement