Sunday, May 5, 2024

గ్రీన్ఇండియా చాలెంజ్ విసిరిన నటి ఎస్తర్

రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ లో భాగంగా జూబ్లీహిల్స్ జిఎచెంసి పార్క్ లో సినీ నటి ఎస్తర్ మొక్కలు నాటింది. ఈ సందర్భంగా ఎస్తర్ మాట్లాడుతూ గ్రీన్ ఇండియా చాలెంజ్ లో పాల్గొని మొక్కలు నాటడం ఆనందంగా ఉందని అన్నారు. వాతావరణ కాలుష్యాన్ని అరికట్టాలంటే మొక్కలు నాటడం ఒక్కటే పరిష్కారం అని అన్నారు.ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని రాబోయే తరాలకు మంచి వాతావరణం అందించడం మన కర్తవ్యం అని ఆమె అన్నారు.ఈ సందర్భంగా ఎంపీ సంతోష్ కుమార్ కి కృతజ్ఞతలు తెలియజేశారు.అనంతరం డైరెక్టర్ సునీల్ కుమార్ రెడ్డి,నిర్మాత బాపిరాజు,నటుడు అజయ్ కి ముగ్గురికి గ్రీన్ ఇండియా చాలెంజ్ విసిరింది ఎస్తర్.

Advertisement

తాజా వార్తలు

Advertisement