Friday, April 26, 2024

ఆస్పత్రిలో భారీ అగ్ని ప్రమాదం.. ఐదుగురు స‌జీవ‌ద‌హ‌నం

ఆస్ప‌త్రిలో భారీ అగ్నిప్ర‌మాదంలో ఐదుగురు స‌జీవ‌ద‌హ‌న‌మైన విషాద ఘ‌ట‌న జార్ఖండ్ లో జరిగింది. ధన్ బాద్ లోని ఓ హాస్పిటల్ కాంప్లెక్స్ లో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఐదుగురు సజీవదహనమ‌య్యారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పేస్తున్నారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా హాస్పిటల్ భవనం రెండో అంస్తులో మంటలు చెలరేగాయి. అక్కడి నుంచి వేగంగా మొదటి అంతస్థును చుట్టేశాయి. అదే అంతస్తుల్లో నిద్రలో ఉన్న వైద్య దంపతులు, ఇతర ఉద్యోగులు బయటపడలేకపోయారు. పొగకు ఊపిరాడక ప్రాణాలు కోల్పోయినట్టు పోలీసులు వెల్లడించారు. ఈ ప్రమాదంలో ఓ డాక్టర్ దంపతులతో పాటు వారి బంధువు, మరో ఇద్దరు సిబ్బంది ఉన్నారని ధన్ బాద్ డీఎస్పీ అరవింద్ కుమార్ చెప్పారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement