Tuesday, April 16, 2024

దారుణం.. చిన్నారిపై మైనర్ బాలుడి అఘాయిత్యం

అభంశుభం తెలియని ఓ చిన్నారిపై మైనర్ బాలుడు అఘాయిత్యానికి ఒడిగట్టాడు. ఈ సంఘటన కడప జిల్లాలోని పెద్దముడియం మండలం గరిసెలూరులో జరిగింది. ఐదేళ్ల చిన్నారిపై జీవన్ అనే 14 ఏళ్ల బాలుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. చిన్నారిద్వారా విషయం తెలుసుకున్న తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. చిన్నారి తల్లి పొలం పనులకు వెళ్ల‌గా ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఈ ఘటన జరిగింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement