Wednesday, May 15, 2024

Breaking: నదిలో పడ్డ బస్సు, ఆరుగురు మృతి.. జార్ఖండ్​లో ఘటన

జార్ఖండ్​లో ఘోరం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు నదిలో పడింది. ఈ ఘటన కొద్దిసేపటి క్రితమే జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు చనిపోయినట్టు తెలుస్తోంది. పలువురు నది నీటిలో చిక్కుకున్నారు. బస్సు కింద చిక్కుకున్న వారిని బయటికి తీసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఘటనలో మృతుల సంఖ్య పెరిగనున్నట్టు ఘటనా స్థలాన్ని చూస్తే తెలుస్తోంది. చాలా మందికి తీవ్ర గాయాలయ్యాయి.

జార్ఖండ్‌లోని హజారీబాగ్‌లో బస్సు నదిలో పడింది. బస్సు కింద పలువురు చిక్కుకున్నట్లు సమాచారం. తాటి ఝరియాలోని సివానే వంతెన సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. బస్సు గిరిదిహ్ నుండి రాంచీకి వెళ్తుండగా ఈ ప్రమాదానికి గురయ్యింది. బాధితులను కాపాడేందుకు పోలీసులు రెస్క్యూ ఆపరేషన్​ చేపట్టారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement