Sunday, April 28, 2024

మెడికల్ కాలేజీల్లో చేరేందుకు 20 వరకు గడువు.. వెల్ల‌డించి కాళోజీ యూనివ‌ర్సిటీ

వరంగల్‌, ప్రభన్యూస్‌ ప్రతినిధి: మహవీర్‌, టీఆర్‌ఆర్‌ మెడికల్‌ కళాశాలలకు చెందిన విద్యార్థులు ఇతర కళాశాలల్లో చేరే గడువును ఈ నెల 20 వరకు పొడిగించారు. ఈ రెండు కళాశాలల గుర్తింపును నేషనల్ మెడికల్‌ కౌన్సిల్‌ రద్దు చేసిన నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆ విద్యార్థులను ఇతర మెడికల్‌ కళాశాలల్లో సర్దుబాటు చేస్తూ కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం నిర్ణయం తీసుకుంది. ఎంబీబీఎస్‌ విద్యార్థులు ఆయా కళాశాలల్లో రిపోర్ట్‌ చేసేందుకు 17వ తేదీ గడువుపెట్టింది. రాష్ట్ర ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించినందున ఆ గడువును 20 వరకు పొడిగిస్తూ కాళోజి వర్సిటీ శనివారం ప్రకటన జారీచేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement