Friday, May 10, 2024

చుట్టాలింటికి పోయొచ్చేస‌రికి భారీ చోరీ… 2.90 లక్షల సొత్తు దోచుకెళ్లిన దొంగలు

భీమారం, (ప్రభ న్యూస్) : హ‌నుమ‌కొండ జిల్లా కాకతీయ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ చోరీ జ‌రిగింది. బస్వరెడ్డి టౌన్ షిప్ లో కడెం మహేశ్‌ ఇంట్లో ఈ దొంగతనం జరిగినట్లు కె.యూ ఇన్‌స్పెక్టర్ దయాకర్ తెలిపారు. బసవ రెడ్డి టౌన్‌షిప్‌లో నివాసం ఉండే కడం మహేష్ బంధువుల ఇంట్లో శుభకార్యం ఉందని ఈనెల 15వ తేదీన ఊరికి వెళ్లాడు.

శనివారం ఉదయం ఇంటికి వచ్చి చూసేసరికి ఇంటి తాళాలు పగలగొట్టి బీరువాలో ఉన్న బంగారు నగలు గుర్తు తెలియని వ్యక్తులు దోచుకెళ్లార‌ని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో కూయూ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోయిన బంగారు సొత్తు విలువ దాదాపు రెండు లక్షల 90వేల దాకా ఉంటుందని ఆ ఫిర్యాదులో పేర్కొన్నాట్లు సి.ఐ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement