Tuesday, May 14, 2024

5K Run: హైద‌రాబాద్ లో 5కే ర‌న్.. భారీగా పొల్గొన్న జ‌నం

హైదరాబాద్, జూన్ 12 (ప్రభ న్యూస్) : రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా పోలీస్, జిహెచ్ఎంసి ఆధ్వర్యంలో 2కే, 5కే రన్ రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమ్మద్ అలీ, చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి, జిహెచ్ఎంసి కమిషనర్ లోకేష్ కుమార్ నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ప్రసాద్ ఐమాక్స్ వద్ద జెండా ఊపి ప్రారంభించారు. ప్రసాద్ ఐమాక్స్ వద్ద ఏర్పాటైన సమావేశంలో నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి మాట్లాడుతూ.. ఆరోగ్యకర తెలంగాణ రాష్ట్రంలో రన్నింగ్, యోగ, ఎక్సర్ సైజ్ జీవితంలో భాగంగా చేసుకోవాల‌న్నారు.

అంబేద్కర్ విగ్రహం నుండి రోటరీ, లేక్ పీఎస్, పీపుల్ ప్లాజా ఐమాక్స్ వరకు 2కే రన్, కొత్త సచివాలయం వరకు 5కే రన్ ఉద్యోగులు యువత, పోలీస్ జిహెచ్ఎంసి భాగస్వాములయ్యారు. ఈ కార్యక్రమంలో స్పోర్ట్స్ మంత్రి శ్రీనివాస్ గౌడ్, స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్, సీఎస్ శాంత కుమారి, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్, ఆర్ అండ్ బీ సెక్రటరీ శ్రీనివాస రాజు, డీజీపీ ఆంజని కుమార్, ఫైర్ డీజీ నాగిరెడ్డి, నటి శ్రీలీల సింగర్ మంగిలి, షూటింగ్ చాంపియన్ ఈషా, అడిషనల్ సీపీ ఏఆర్ శ్రీనివాస్ అడిషనల్ సీపీ సత్యనారాయణ, ఇతర పోలీస్ శాఖ అధికారులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement