Friday, April 26, 2024

దేశంలో కొత్త‌గా 43,846 కరోనా కేసులు

దేశంలో కొత్త‌ క‌రోనా కేసులు మళ్లీ భారీగా నమోదయ్యాయి. గ‌త‌ 24 గంట‌ల్లో 43,846 మందికి కరోనా నిర్ధారణ అయింది. ఈ సంవత్సరం నమోదైన అత్యధిక కేసులు ఇవే కావడం గమనార్హం .కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ వీటికి సంబంధించిన వివరాలను ఈ రోజు ఉదయం విడుదల . కొత్త‌గా 22,956 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,15,99,130కు చేరింది.గడచిన 24 గంట‌ల సమయంలో 197 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,59,755కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,11,30,288 మంది కోలుకున్నారు.

ఇక తెలంగాణలో గత 24 గంటల్లో కొత్త‌గా 394 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనాతో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. అదే సమయంలో 194 మంది కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,03,118 కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 2,98,645 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య 1,669గా ఉంది. తెలంగాణలో ప్రస్తుతం 2,804 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. వారిలో 1,123 మంది హోం క్వారంటైన్ లో చికిత్స తీసుకుంటున్నారు. జీహెచ్ఎంసీ ప‌రిధిలో కొత్త‌గా 81 మందికి క‌రోనా సోకింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement