Sunday, April 28, 2024

న‌ర్సీప‌ట్నంలో రోడ్డు ప్రమాదం – ముగ్గురు టెన్త్ విద్యార్థులు దుర్మ‌ర‌ణం

న‌ర్సీప‌ట్నంలో జ‌రిగిన‌ రోడ్డు ప్రమాదంలో ముగ్గురు విద్యార్థులు మృతి చెందారు. న‌ర్సీపట్నానికి చెందిన సహాడి వర్షిత్, పాటి అనిల్ కుమార్, రుత్తల సాయి లు 10వ తరగతి చదువుతున్నారు. ఈ ముగ్గురు శనివారం రాత్రి బైక్ మీద బయటకు వెళ్లారు. మాకవరపాలెం ప్రభుత్వ జూనియర్ కాలేజీ వద్దకు రాగానే.. బైక్ అదుపుతప్పి చెట్టును బలంగా ఢీకొట్టింది. దాంతో ముగ్గురికి తీవ్ర గాయాలుకాగా.. ఒక విద్యార్థి ప్రమాదస్థలిలోనే మృతిచెందాడు. మరో ఇద్దరిని ఆస్పత్రికి తరలించగా.. ఒక విద్యార్థి నర్సీపట్నం ఆస్పత్రిలో మరణించాడు. మరో విద్యార్థి పరిస్థితి విషమంగా ఉండటంతో విశాఖకు తరలిస్తుండగా మార్గమధ్యలో చనిపోయాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.‌

Advertisement

తాజా వార్తలు

Advertisement