Friday, April 26, 2024

రోహిత్ తో ఆడితే ఇక అంతే… కోహ్లీ కామెంట్స్

ఇంగ్లాండ్తో టి20 సిరీస్ ను చేసుకున్న భారత జట్టు ఆటగాళ్లపై కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రశంసల వర్షం కురిపించాడు. జట్టులోని అందరు ఆటగాళ్లు సమిష్టిగా రాణించడం వల్లే విజయ్ సాధ్యమైందన్నా డు కోహ్లీ ఇక బ్యాటింగ్ విభాగంలో తమ జట్టు చాలా బలంగా ఉందని నిన్నటి మ్యాచ్ లో తెలిసిపోతుందని వ్యాఖ్యానించాడు. మైదానంలో తేమ ప్రభావం అధికంగా ఉన్నప్ప‌టికీ గత మ్యాచ్‌లాగే చివ‌రి మ్యాచ్‌లో బాగా రాణించామ‌ని చెప్పాడు. జ‌ట్టు ఆట‌గాళ్లు పంత్‌, శ్రేయస్‌ బ్యాటింగ్‌ చేయాల్సిన అవసరం లేకుండానే ఇంగ్లండ్ బౌల‌ర్ల‌ను దీటుగా ఎదుర్కొని  224 పరుగుల భారీ స్కోర్‌ సాధించామ‌న్నాడు. త‌మ బ్యాటింగ్‌ లైనప్ చాలా బలంగా ఉంద‌ని దీని ద్వారానే చెప్పవ‌చ్చ‌ని అన్నాడు.

ఇక తాను విరాట్ తో ఓపెనింగ్ కి రావడం పై స్పందించిన కోహ్లీ.. త‌న‌పై రోహిత్‌కు, రోహిత్ పై త‌న‌కు‌ సానుకూల దృక్పథం ఉంద‌ని చెప్పాడు. పిచ్‌లో ఒకరు ధాటిగా ఆడితే, మరొకరు నిలకడగా ఆడాలని అనుకున్నామ‌ని తెలిపాడు.  సూర్య, హార్దిక్‌ మ్యాచ్‌లో మరింత దూకుడుగా రాణించి ముందుకు తీసుకెళ్లారని తెలిపాడు. ఐపీఎల్‌లోనూ తాను ఓపెనింగ్‌ చేస్తాన‌ని తెలిపాడు. గతంలో వివిధ స్థానాల్లో బ్యాటింగ్‌ చేసిన అనుభవం త‌న‌కు ఉంద‌ని అన్నాడు. ఇకపై రోహిత్‌తో కలిసి తాను కచ్చితంగా ఓపెనింగ్ చేస్తాన‌ని తెలిపాడు. త‌మ‌ ఇద్దరిలో ఎవరు నిలిచినా ఇతర బ్యాట్స్‌మెన్‌కు ఆత్మవిశ్వాసం పెరుగుతుందని, దీంతో జట్టుకు ఎంతో మేలు క‌లుగుతుంద‌ని చెప్పాడు కింగ్ కోహ్లీ.

Advertisement

తాజా వార్తలు

Advertisement