Sunday, May 5, 2024

రేపే పీఆర్సీ ?

సుదీర్ఘ నిరీక్షణకుతెరపడనుంది. ఎంప్లాయి ఫ్రెండ్లీ సర్కార్‌గా
పేరున్న తెలంగాణ ప్రభుత్వం ఈ నెల 22న శాసన సభా వేదికగా కీలక నిర్ణయాలను ప్రకటించనుం
ది. ఈ మేరకు సీఎం కేసీఆర్ సిద్ధమైనట్లు తెలిసింది. రెండేళ్లుగా ఉద్యోగులు వేచిచూస్తున్న సమస్యలకు సీఎం కేసీఆర్ తనదైన శైలిలో శుభవార్త వినిపించనున్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయ
వర్గాలకు 30శాతం ఫిట్‌మెంట్ తో పీఆర్సీ ప్రకటించనున్నారని, ఇందుకు సోమవారం శాసన
సభలో ఆయన బడ్జెట్
పై సాధారణ చర్చలో భాగంగాసమాధానంలో లేదంటే ప్రత్యేక ప్రకటన చేయనున్నారని విశ్వసనీయంగా తెలిసింది. 2021-22 బడ్జెట్ పై సాధారణ చర్చ శనివారం ప్రారంభమైంది. ఈ చర్చలో భాగంగా పలువురు విపక్ష, స్వపక్ష సభ్యులు
మాట్లాడారు. దీనిపై సోమవారం మధ్యాహ్నం తర్వాత సీఎం కేసీఆర్ సమాధానం ఇవ్వనున్నారు. సభ్యులు లేవనెత్తిన అనేక అనుమానా
లు, ప్రశ్నలకు సీఎం కేసీఆర్ సవివరసమాధానం ఇవ్వనున్నారు. అదే సమయంలో రాష్ట్రంలో జరిగిన రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్ని
కల్లో విజయం సాధించి ఊపుమీదున్న టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఈనెల 9న ఉద్యోగ సంఘాలకిచ్చిన మాటను నిలబెట్టుకోనుంది.

ఉద్యోగులు, ఉపాధ్యాయులు పూర్తిగా సహకరించడంతోనే సిట్టింగ్ స్థానాన్నినిలుపుకోవడంతోపాటు, బీజేపీ సిట్టింగ్ స్థానాన్ని తమ ఖాతాలో వేసుకోవడం సాధ్యమైందని సీఎం కేసీఆర్ కు ఇంటెలిజెన్స్ తోపాటు, పలు
మార్గాల్లో సమాచారం అందింది. ఎన్నికలకు ముందు టీజీవో, టీజీవో, టీఎన్టీవో, సీపీఎస్, సచివాలయ ఉద్యోగుల సంఘం, తెలంగాణ ఉద్యోగులసంఘం, ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాలు టిఆర్ఎస్ కు తమ బహి రంగ మద్దతు ప్రకటించాయి. ఎన్నికల ప్రచారంలో కూడా జోరుగా
పాల్గొన్నాయి. సీఎం కేసీఆర్ తో ఈ నెల 9న ఎన్నికలకు ముందు భేటీ అయిన తర్వాత తమ మద్దతు టీఆర్ఎస్ కేనని, పీఆర్సీ ప్రకటించనున్నారని ఓపెన్ గా చెప్పాయి. దీంతో ఎన్నికల సంఘం నుంచి నోటీసుల ను కూడా అందుకోవాల్సి వచ్చింది.

వీటన్నింటినీ పరిగణలోకి తీసు
కున్న ప్రభుత్వం ఉద్యోగుల త్యాగాలకు గుర్తుగా 30శాతంపైనే పీఆర్సీ
ఫిట్మెంట్ తోపాటు, సీపీఎస్ ఉద్యోగులకు ఫ్యామిలీ పింఛన్ పథకం, ఉద్యోగుల రిటైర్మెంట్ వయో పరిమితి పెంపు 61 ఏళ్లకు పెంపు, కేంద్రప్రభుత్వ ఉద్యోగుల ఆరోగ్యపథకం(సీజీ హెచ్ఎస్) తరహాలో తెలంగా
ణ ఉద్యోగుల ఆరోగ్య పథకం (ఈహెచ్ఎస్)లో ప్రతి నెలా ఉద్యోగుల వేతనాల నుంచి కొంత మొత్తం వసూలు చేసి మెరుగైన ఆరోగ్య పథ
కం, అన్‌లిమిటెడ్ గా అమలు చేసే పథకం ప్రకటించనున్నారని సమాచారం. రెండోసారి కేసీఆర్ ప్రభుత్వం ఏర్పాటు తర్వాత తమ డిమాండ్లు నెరవేరుతాయని ఉద్యోగులు ఆశతో ఉన్నారు. పీఆర్సీ ప్రకటన,ఉద్యోగులవయోపరిమితి పెంపు అంశాలపై ప్రతి నెలా చర్చ జరుగుతూ వచ్చింది. ఈ ఏడాది జనవరి నెలలో 1200 మంది ఉద్యోగులు పదవీ విరమణ చేయగా, ఫిబ్రవరిలో మరో 1000 మంది పదవీ
విరమణ చేశారు. ఈ నెలలో 1200 మంది రిటైర్ కానున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement