Tuesday, May 7, 2024

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 4శాతం డీఏ పెంపు..!

కేంద్ర ప్ర‌భుత్వ ఉద్యోగులకు, పెన్ష‌ర్ల‌కు డీఏ పెరిగినట్లు తెలుస్తోంది. వారికి 4 శాతం డీఏను పెంచిన‌ట్లు సమాచారం. అయితే కొత్త జీతాల‌తో పాటు ఎరియ‌ర్లను ఇవ్వ‌నున్న‌ట్లు తెలుస్తోంది. మార్చిలో డీఏను మూడు శాతం పెంచిన విష‌యం తెలిసిందే. కేంద్ర క్యాబినెట్ దీనికి ఆమోదం చెప్పినట్లు ప్ర‌భుత్వ వ‌ర్గాల ద్వారా వెల్ల‌డైంది. క‌రువు భ‌త్యం పెంపుతో సుమారు 47.68 ల‌క్ష‌ల మంది కేంద్ర ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు ల‌బ్ధి చేకూర‌నున్న‌ది. మ‌రో 68.62 ల‌క్ష‌ల మంది పెన్ష‌ర్లకు కూడా బెనిఫిట్ జ‌ర‌గ‌నున్న‌ది. సాధార‌ణంగా డీఏను జూలై ఒక‌టో తేదీ నుంచి అమ‌లు చేస్తారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement