Friday, April 19, 2024

సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్‌.. దసరా కానుక‌గా లాభాల్లో 30 శాతం వాటా..

సింగరేణి కాలరీస్ సంస్థ 2021 -22 సంవత్సరానికి గాను సాధించిన లాభాల్లో 30 శాతం వాటాను సింగరేణి ఉద్యోగులకు దసరా కానుకగా అందించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు సింగరేణి కార్మికులకు ప్రత్యేక ప్రోత్సాహకాన్ని దసరా లోపు వెంటనే చెల్లించాల్సిందిగా సింగరేణి చైర్మన్, మేనేజింగ్ డైరక్టర్ కు, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ నర్సింగరావు ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో భాగంగా అర్హులైన కార్మికులకు 368 కోట్ల రూపాయలను సింగరేణి సంస్థ చెల్లించనున్నది.

Advertisement

తాజా వార్తలు

Advertisement