Saturday, May 4, 2024

ఢిల్లీలో దారుణం.. నలుగురు ఒక్కటయ్యారు.. ఇనుపరాడ్లతో కుళ్లబొడిచారు..

ఢిల్లీ సమీపంలోని పాత ఫరీదాబాద్ పోలీస్ స్టేషన్‌లో ఓ కేసు నమోదైంది. ఓ వ్యక్తిని నలుగురు దుండగులు ఇనుప రాడ్​లతో కాళ్లపై తీవ్రంగా కొట్టిపడేశారు. జిల్లాలోని ఖేరిపూల్ సమీపంలోని హుడా మార్కెట్‌లో గురువారం రాత్రి ఈ ఘటన జరిగింది. వ్యక్తిగత కక్షలతోనే  నలుగురు గూండాలు ఆ వ్యక్తిపై ఇనుప రాడ్‌లతో దారుణంగా దాడికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. దాడికి సంబంధించిన వీడియో క్లిప్ కూడా బయటకు వచ్చింది. బాధితుడు ఖేరిపుల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మావాయి గ్రామానికి చెందిన తౌసిమ్ అలియాస్ వసీమ్‌గా గుర్తించారు.  అతనో ట్రాక్టర్​ డ్రైవర్​ అని పోలీసులు తెలిపారు. కాగా, బాధితుడిని  ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. దాడి చేసిన వారిలో ఒకరిని అరెస్టు చేశామని,  మిగతావారిని పట్టుకోవడానికి ప్రయత్నాలు కొనసాగుతున్నాయని పోలీసులు తెలిపారు.

అరెస్టయిన నిందితుడు సాహిల్ మరో ఇద్దరు నిందితులు నిక్కీ, అర్జున్ అని పోలీసులు చెప్పారు. త్వరలోనే మిగతా వారిని అరెస్టు చేస్తాం అని ఫరీదాబాద్ పాత పోలీస్ స్టేషన్  ఇన్స్పెక్టర్ దినేష్ కుమార్ తెలిపారు. బాధితుడికి, నిందితులకు మధ్య తలెత్తిన వ్యక్తిగత గొడవలే ఈ ఘటనకు కారణమన్నారు. అయితే తన కొడుక్కొ ఎవరితోనూ గొడవలు లేవని, ఎందుకు అంతలా హింసించారో, కాళ్లు విరిగేలా కొట్టారో తెలియదని బాధితుడి తల్లి షబ్నమ్​ కన్నీరు మున్నీరు అవుతూ చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement