Sunday, May 19, 2024

హైదరాబాద్ నుంచి 30 విమానాలు రద్దు

కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో  శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి పలు విమాన సర్వీసులు రద్దు అయ్యాయి. శంషాబాద్‌ నుంచి రాకపోకలు సాగించాల్సిన 30 సర్వీసులను అధికారులు రద్దు చేశారు. ఢిల్లీ, ముంబయి, బెంగళూరు, పుణె, రాజమండ్రి తదితర ప్రాంతాలకు వెళ్లాల్సిన విమానాలను నిలిపివేశారు. ఢిల్లీ, బెంగళూరు, ముంబయి నగరాల్లో లాక్‌ డౌన్‌ అమల్లో ఉండటంతో ప్రయాణికులు తమ ప్రయాణాలను రద్దు చేసుకుంటున్నారు. అలాగే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే ప్రయాణికులపై పలు రాష్ట్రాల్లో ఆంక్షలు అమల్లో ఉన్నాయి. ఆర్టీపీసీఆర్‌ నెగెటివ్‌ రిపోర్టు ఉంటేనే అనుమతిస్తూ.. 14 రోజుల క్వారంటైన్‌ విధిస్తున్నారు. దేశీయ విమాన సర్వీసులతో పాటు అంతర్జాతీయ సర్వీసులపైనా ఈ ప్రభావం పడింది. ఇప్పటికే వివిధ దేశాలు భారత్‌ నుంచి వచ్చే విమానాలపై ఆంక్షలు విధిస్తున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌ నుంచి లండన్‌, దుబాయి, షార్జా సర్వీసులు రద్దు అయ్యాయి. వివిధ రాష్ట్రాల్లో కరోనా తీవ్రత పెరగడంతో విమానాలను రద్దు చేసినట్లు ఆధికారులు ప్రకటించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement