Monday, May 6, 2024

హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ కి గోల్డ్ స్మగ్లర్ల తాకిడి!

శంషాబాద్ విమానాశ్రయానికి స్మగ్లర్ల తాకిడి పెరిగిపోతోంది. తాజాగా బంగారం అక్రమంగా రవాణా చేస్తూ ఓ వ్యక్తి దొరికిపోయాడు. దుబాయ్ నుంచి వస్తున్న ప్రయాణికుడి బ్యాగ్‌లో ఏకంగా 2.5 కిలోల బంగారాన్ని అధికారులు గుర్తించారు. ఈ బంగారం బిస్కెట్లను ఎయిర్‌ పోర్టు కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. బ్యాగులో దాచుకుని తీసుకువస్తుండగా అనుమానం వచ్చిన కస్టమ్స్ అధికారులు చెక్ చేయడంతో బండారం బయటపడింది. పట్టుబడిన వ్యక్తిని కస్టమ్స్ అధికారులు విచారణ జరుపుతున్నారు. వీటి విలువ కోటీ యాభై లక్షల పైనే ఉంటుందని అధికారులు చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement