Wednesday, April 24, 2024

రాష్ట్రంలో బెడ్ల సవాల్

తెలంగాణ రాష్ట్రంలో బెడ్ల కొరత సర్కారు సవాల్ గా మారింది. కరోనా తీవ్రతతో హాస్పిటల్ లో బెడ్లను పెంచుకుంటూపోతే.. దానికంటే ముందుగా కోవిడ్ పరుగులు తీస్తోంది. గత రెండు వారాలుగా ఆక్సిజన్ సరఫరా, ఐసీయూలో వెంటిలేటర్
సౌకర్యం ఉన్న బెడ్ల సంఖ్య విపరీతంగా పెరిగింది. అయితే అంతకంటే వేగంగా ఈ రెండు అవసరమైన కరోనా బాధితుల సంఖ్య పెరిగిపోతుంది. పరిస్థితి తీవ్రరూపం దాల్చి ఐసీయూకి వెళుతున్న రోగుల సంఖ్య గత రెండువారాల్లో వేలల్లో దూసుకుపోతోంది. గాంధీ
ఆసుపత్రిలో పూర్తిగా కోవిడ్ రోగులకు వైద్యం అందిస్తుండగా, ఇక్కడ ఆక్సిజన్ సౌకర్యం ఉన్న, వెంటిలేటర్ వసతి కలిగిన పడకలు ఎప్పుడూ ఫుల్ గా ఉంటున్నాయి. ప్రభుత్వ లెక్కల్లో
గాంధీని మినహాయించింది. మిగిలిన ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఏప్రిల్ 20తో పోల్చితే మే 7 సాయంత్రానికి ఆక్సిజన్ బెడ్స్, ఐసీయూల్లో కరోనా రోగులు 28, 170 మంది పెరిగారు.
మొదట్లో ఆ సంఖ్య 5,827 కాగా, ఇప్పుడది 28,170గా ఉంది. రెండువారాల్లో 400 శాతానికిపైగా చేరింది. అదే తేదీల్లో కేవలం ఐసీయూ వరకే తీసుకున్నా బాధితుల సంఖ్య నాలుగింతలు పెరిగింది.

హైదరాబాద్ లోని ప్రభుత్వ, ప్రైవేట్ హాస్పిటల్ లో ఐసీయూ బెడ్లన్నీ దాదాపు నిండిపోయాయి. పరిస్థితి విషమించి ఎవరినైనా చేర్చాల్సి వస్తే పడక దొరకడం అసాధ్యంగా మారింది. రెండు వారాల్లో పరిస్థితి తీవ్రరూపం దాల్చింది. హైదరాబాద్ లో గాంధీ, టిమ్స్, కింగ్ కోటి, చె హాస్పిటల్, ఈఎస్ఎ, నిమ్స్, రైల్వే ఆసుపత్రి ఇలా అన్నింటిలోనూ పడకలు పూర్తిగా నిండిపోయాయి. ప్రభుత్వ ఫీవర్ ఆసుపత్రిలో ఆక్సిజన్ పడకలను కూడా వెంటిలేటర్ బెడ్లుగా మార్చడంతో కొన్ని ఖాళీలు ఉన్నట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. అధికారిక లెక్కల ప్రకారం ఐసియు బెడ్లు 74శాతం, ఆక్సిజన్ బెడ్లు 68శాతం నిండిపోయాయి.

ఈ ఆక్యుపెన్సీ రాష్ట్ర చరిత్రలో రికార్డు. అయితే.. ఈ రెండు రకాల బెడ్లు వందశాతం నిండిపోయాయని, ఒక పేషంట్ డిశ్చార్జి అయితేనే మరో పేషంట్ కు బెడ్ దొరికే పరిస్థితి ఉందని క్షేత్రస్థాయి పరిస్థితులు చెబుతున్నారు. అక్కడక్కడా కొన్ని చిన్న హాస్పిటల్ లో బెడ్లు ఖాళీలున్నా కరోనా బాధితుల ప్రాణ భయాన్ని, నిస్సహాయతను ఆసరాగా చేసుకొని దోచుకుంటున్నాయి. అక్కడ మెరుగైన వైద్య సదుపాయాలు ఉన్నాయన్న నమ్మకం లేక పోయినా..అత్యవసరానికి ఏదో ఒకటి అని చేరే పరిస్థితి ఉంది. అయితే ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లే సాధారణ, మధ్య తరగతి ప్రజలు ఆ బిల్లులకు తట్టుకోవడం కష్టంగా మారింది. కరోనా కుటుంబాలలో హృదయవిదారక పరిస్థితులను తీసుకొస్తోంది. ఈ సంకట స్థితిని ఛేదించడం ప్రభుత్వానికి సవాల్ గా మారింది. సీఎం ఆదేశాలమేరకు యంత్రాంగం సీరియస్ గా దృష్టిపై
ట్టినా వెల్లువెత్తుతున్న కేసుల నేపథ్యంలో ఎవరూ ఏం చేయలేని పరిస్థితి నెలకొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement