Sunday, May 19, 2024

2nd Test: ముగిసిన తొలిరోజు ఆట.. భారత్ స్కోరు 21/0

ఢిల్లీ అరుణ్ జైట్లీ స్టేడియంలో భార‌త్ వ‌ర్సెస్ ఆస్ట్రేలియా జ‌ట్ల మ‌ధ్య జ‌రుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేపట్టిన ఆస్ట్రేలియా జ‌ట్టు 263 ప‌రుగులకు ఆలౌట్ అయ్యింది. ఆస్ట్రేలియా బ్యాట్స్ మెన్లు ఉస్మాన్ ఖవాజా 81 పరుగులు, హ్యాండ్స్ కాంబ్ 72 పరుగులు, పాట్ కమ్మిన్స్ 33 పరుగులు చేసి ఔటయ్యారు. భారత్ బౌలర్లు మహమ్మద్ షమీ నాలుగు వికెట్లు తీయగా, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజాలు ఒక్కొక్కరు మూడు వికెట్ల చొప్పున తీశారు. ఆ తర్వాత బ్యాటింగ్ చేపట్టిన భారత జట్టు తొలిరోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 21పరుగులు చేసింది. భారత్ ఓపెనర్లు రోహిత్ శర్మ 13 పరుగులు, కేఎల్ రాహుల్ 4 పరుగులు చేశారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement