Friday, May 3, 2024

క‌న్నా వ్యాఖ్య‌ల‌పై స్పందించాల్సిన అవ‌ర‌సం లేదు : సోము వీర్రాజు

బీజేపీకి రాజీనామా చేసిన కన్నా లక్ష్మీనారాయణ వ్యాఖ్య‌ల‌పై ఎట్ట‌కేల‌కు ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు సోము వీర్రాజు స్పందించారు. కన్నా లక్ష్మీనారాయణ చాలా కాలంగా తనపై ఆరోపణలు చేస్తున్నారు, వాటిపై తాను ఎప్పుడూ స్పందించలేదన్నారు. ఇప్పుడు కూడా స్పందించాల్సిన అవసరం లేదని, తాను ఏమిటనేది పార్టీ హైకమాండ్ కు తెలుసన్నారు. ఇదిలా ఉంటే ఇక జ‌న‌సేనా పొత్తుల విష‌యంలో కూడా సోము వీర్రాజు స్పందించారు.. బీజేపీతో జ‌న‌సేన పార్టీ పొత్తులో ఉన్నామ‌న్నారు. తాజాగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై వారాహి వాహనానికి పూజ చేయించిన సందర్భంగా పవన్ కల్యాణ్ చెప్పారని గుర్తు చేశారు. రాష్ట్రంలో అమలవుతున్న పథకాలకు కేంద్ర ప్రభుత్వం 60 శాతం నిధులను ఇస్తోందని… ఆ నిధులన్నింటినీ తాము ఖర్చు చేస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పుకోవడం శోచనీయమని విమర్శించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement