Friday, April 26, 2024

టూరిస్టు బస్సు బోల్తా.. 25 మందికి తీవ్ర గాయాలు

ఒడిశాలోని పూరీ నుంచి టూరిస్టులతో ప్రయాణిస్తున్న బస్సు ప్రమాదానికి గురైంది. ఈ యాక్సిడెంట్​లో 25 మంది గాయపడినట్లు ఆదివారం అధికారులు తెలిపారు. పూరీ నుంచి తమిళనాడు వైపు వెళ్తున్న బస్సు గంజాం జిల్లా రంభ సమీపంలో హైవేపై బోల్తా పడిందని పోలీసులు తెలిపారు. బస్సులో దాదాపు 50 మంది ప్రయాణికులు ఉన్నారు. గాయపడిన 25 మందిలో నలుగురికి తీవ్రమైన గాయాలయ్యాయి.

ప్రమాద స్థలం సమీపంలో హైవే విస్తరణ పనులు జరుగుతున్నాయి. గంజాం జిల్లా మేజిస్ట్రేట్, ఛత్రపూర్ సబ్ కలెక్టర్ ఘటనా స్థలాన్ని సందర్శించారు. గాయపడిన వారి కోసం రెస్క్యూ స్క్వాడ్‌ను కూడా రప్పించారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement