Tuesday, April 16, 2024

పెద్దపల్లి రోడ్డు ప్రమాదం.. మూడుకు చేరిన మృతులు

పెద్దపల్లి రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వారి సంఖ్య మూడుకు చేరింది. రాజీవ్ రహదారిపై ఆగి ఉన్న డీసీఎంను వెనక నుండి స్కార్పియో ఢీకొట్టిన ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తి మృతి చెందాడు. దీంతో మృతుల సంఖ్య మూడుకు పెరిగింది. పెద్దకల్వల శివారులో డిసిఎం సాంకేతిక లోపంతో నిలిచిపోగా మధ్యప్రదేశ్ నుండి హైదరాబాద్ వెళ్తున్న స్కార్పియో వెనుక నుండి ఢీకొన్న విషయం విదితమే. ఈ ప్రమాదంలో మధ్య ప్రదేశ్ కు చెందిన చైత్ర ముఖి (25), హులాస్ రామ్ (40) అక్కడికక్కడే మృతి చెందగా స్కార్పియో లో ప్రయాణిస్తు గాయపడ్డ హేమేంద్ర సహరి నీ హైదరాబాద్ కు తరలిస్తుండగా మార్గమధ్యంలో సిద్దిపేట వద్ద మృతి చెందాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement