Saturday, April 27, 2024

Flash: నిద్రిస్తున్న వారిపై దూసుకెళ్లిన లారీ.. ఇద్దరు మృతి

మేడ్చల్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. నిద్రిస్తున్న వారిపై లారీ వెళ్లడంతో ఇద్దరు దుర్మరణం పాలైయ్యారు. ఈ ఘటన పేట్ బషీరాబాద్ పీఎస్ పరిధి గోదావరి హోమ్స్ లో చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న భవనం ముందు చందన్ రామ్(23), చందన్ కుమార్ సహరి(23) నిద్రిస్తున్నారు. తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో ఐరన్ లోడుతో వచ్చిన లారీ.. వెనక్కి చూసుకోకుండా నిద్రిస్తున్న వారిపై వెళ్లడంతో వారు మృతి చెందారు. మృతులు బీహార్ రాష్ట్రానికి చెందిన వలస కార్మికులుగా గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement