Friday, May 3, 2024

India Corona: దేశంలో స్వల్పంగా పెరిగిన కరోనా.. కొత్తగా ఎన్ని కేసులంటే..

దేశంలో కరోనా మహమ్మారి పూర్తిగా తగ్గింది. ప్రస్తుతం దేశంలో రెండు వేల లోపు కేసులే నమోదు అవుతున్నాయి. తాజా కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించిన బులిటెన్ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశంలో 1581 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,30,10,971కు చేరింది. ఇందులో 4,24,70,515 మంది బాధితులు పూర్తిగా కోలుకున్నారు.

గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 1193 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దేశంలో కరోనాతో 33 మంది మరణించారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 5,16,543కి పెరిగింది. దేశంలో ప్రస్తుతం 23,913 యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశం లో కరోనా పాజిటివిటి రేటు 98.16 శాతంగా ఉంది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 1,81,56,01,944 వ్యాక్సిన్లు డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement