Friday, May 3, 2024

ఫిలిప్పీన్స్‌లో కూలిన సైనిక విమానం.. 17 మంది దుర్మరణం

ఫిలిప్పీన్స్‌లో వైమానిక దళానికి చెందిన విమానం కూలిపోయింది. 85 మంది సైనికులు సహా 92 మందితో వెళ్తున్న  సి-130 విమానం ల్యాండ్ అవుతున్న సమయంలో ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఘటనలో 17 మంది మృతి చెందగా.. ఇప్పటి వరకు 45 మందిని రక్షించారు. మిగతా వారిని రక్షించేందుకు సహాయకచర్యలు కొనసాగుతున్నట్టు ఆర్మీ చీఫ్ సిరిలిటో సొబెజనా తెలిపారు

సులు ప్రావిన్స్‌లోని జోలో ద్వీపంలో ల్యాండ్‌ అయ్యే సమయంలో విమానం నేలకూలగా.. అనంతరం మంటలు చెలరేగాయి. విమానం శిథిలాల నుంచి 40 మందిని రక్షించి, వారిని ఆసుప్రతికి తరలించినట్లు దేశ రక్షణ మంత్రి డెల్ఫిన్ లోరెంజానా తెలిపారు. మిగతా వారిని రక్షించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు చెప్పారు. ముస్లిం ప్రావిన్స్ సులులో ప్రభుత్వ దళాలు దశాబ్దాలుగా అబూ సయ్యఫ్ ఉగ్రవాదులతో పోరాడుతున్నాయి.

ఇది కూడా చదవండి: జపాన్‌లో విరిగిపడిన కొండచరియలు.. వంద మందిని మింగేసిన బురద!

Advertisement

తాజా వార్తలు

Advertisement