Tuesday, April 16, 2024

జపాన్‌లో విరిగిపడిన కొండచరియలు.. వంద మందిని మింగేసిన బురద!

జపాన్‌లోని అటామి నగరంలో భారీ వర్షాలు కారణంగా కొండచరియలు విరిగిపడటంతో 20 మంది గల్లంతయ్యారు. వర్షాల దాటికి 80 ఇళ్లు పూర్తిగా పూడుకుపోయాయి. కార్లు కొట్టుకుపోయాయి. రాజధాని టోక్యోకు పశ్చిమంగా వంద కిలోమీటర్ల దూరంలోని సముద్ర తీర పట్టణమైన అటామిలో శనివారం భారీ వర్షం కురిసింది. దీనికి తోడు గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు లోయలు, పర్వత ప్రాంతాల్లోని మట్టి వదులుగా మారి కొండచరియలు విరిగిపోతున్నాయి. దీంతో  సమీప పట్టణాలు, గ్రామాలను ముప్పు వాటిల్లుతోంది. ముంచెత్తుతోంది. ఈ క్రమంలో బురద వెల్లువలా విరుచుపడడంతో  20 మంది గల్లంతయ్యారు.

సమాచారం అందుకున్న వెంటనే రంగంలోకి దిగిన సహాయక సిబ్బంది గల్లంతైన వారి కోసం గాలిస్తున్నారు. గల్లంతైన వారి సంఖ్య వందకుపైనే ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం సహాయక కార్యక్రమాలు కొనసాగుతున్నట్టు అధికారులు తెలిపారు. ప్రమాదం పొంచి ఉందని భావిస్తున్న గ్రామాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

ఇది కూడా చదవండి: వైఎస్ఆర్‌ను తిడితే జగన్ వదిలేసినా.. మేం వదలం: రేవంత్ రెడ్డి

Advertisement

తాజా వార్తలు

Advertisement